మిర్యాలగూడకు చెందిన వ్యాపారవేత్త మారుతీరావు ఆత్మహత్యకు పాయిజనే కారణమని ప్రిలిమినరీ పోస్టుమార్టం రిపోర్ట్లో తేలింది. మారుతీ రావు ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని ఫోరెన్సిక్ వైద్యులు తెలిపారు. గారెల్లో పురుగుల మందు పెట్టుకుని తినడం వల్లే శరీరంలో ఆర్గాన్స్ పని ఆగిపోయిందని స్పష్టం చేశారు. మారుతీరావు శరీరంలో బ్లడ్ సర్క్యూలేషన్ ఆగిపోయి బ్రెయిన్డెడ్, కార్డియాక్ అరెస్ట్ అయినట్లు ప్రాథమిక రిపోర్ట్లో తేలిందన్నారు. మారుతీరావు విస్రా శాంపిల్స్ సేకరించిన ఫోరెన్సిక్ వైద్యులు విస్రా ఎనాలసీస్లో ఎటువంటి పాయిజన్ తీసుకున్నాడో తెలుస్తుందన్నారు.
కాసేపట్లో మిర్యాలగూడలోని హిందూ స్మశానవాటికలో మారుతీరావు అంత్యక్రియలు జరగనున్నాయి. మారుతీరావు మృతదేహానికి బంధువులు, స్నేహితులు నివాళులర్పిస్తున్నారు. మారుతీరావు భార్య గిరిజా, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అంతిమయాత్రకు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.