మిర్యాలగూడలోని హిందూ శ్మశానవాటికలో మారుతీ రావు అంత్యక్రియలు జరుగుతున్నాయి. తండ్రిని కడసారి చూపు కోసం స్మశాన వాటికకు చేరుకుంది అమృత. పోలీసు భద్రత మధ్య తండ్రి అంత్రక్రియలకు వెళ్లింది అమృత. అయితే శ్మశాన వాటికలోని బంధువులు అమృతను అడ్డుకున్నారు. అమృత గో బ్యాక్ అంటూ.. నినాదాలు చేశారు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య తండ్రిని చివరిసారిగా చూసి అమృత వెనుదిరిగింది.. దీంతో పోలీసు భద్రత నడుమ తండ్రి మారుతీరావును చివరిసారిగా చూసుకుంది అమృత.