Telangana: మావోయిస్టు పార్టీకి భారీ షాక్‌.. అగ్రనేత రామన్న భార్య సావిత్రి లొంగుబాటు..

Telangana: మావోయిస్టు పార్టీకి భారీ షాక్‌ తగిలింది.

Update: 2022-09-21 06:38 GMT

Telangana: మావోయిస్టు పార్టీకి భారీ షాక్‌.. అగ్రనేత రామన్న భార్య సావిత్రి లొంగుబాటు..

Telangana: మావోయిస్టు పార్టీకి భారీ షాక్‌ తగిలింది. మావోయిస్టు అగ్రనేత దివంగత రామన్న భార్య, కామ్రేడ్‌ సావిత్రి తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయినట్లు తెలుస్తోంది. 2019 లో రామన్న అనారోగ్యంతో చనిపోయారు. గత కొన్ని నెలల క్రితం రామన్న కొడుకు శ్రీకాంత్ సైతం పోలీసులకు లొంగిపోయాడు. రామన్న మృతి తర్వాత ఆమె భార్య సావిత్రి పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే సావిత్రి తాను లొంగిపోతున్నట్లు తెలంగాణ పోలీసులకు సమాచారమిచ్చారు. బుధవారం సాయంత్రం డీజీపీ మహేందర్రెడ్డి సమక్షంలో మీడియా ముందుకు రామన్న భార్య సావిత్రి రానున్నట్లు అధికారులు తెలిపారు.

Tags:    

Similar News