సిద్ధిపేట జిల్లా చేర్యాలలో దారుణం చోటుచేసుకుంది. భార్య కాపురానికి రాలేదని యాదగిరి అనే వ్యక్తి వాటర్ ట్యాంక్ పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. యాదగిరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా కుటుంబ కలహాలతో యాదగిరి మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. యాదగిరిగికి కూతురు, కొడుకు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.