Mahipal Reddy: తన సోదరుడు మహిపాల్ అరెస్ట్ దారుణం

Mahipal Reddy: తప్పు చేస్తే నోటీసులు ఇచ్చి.. పెనాల్టీలు వేయాలి

Update: 2024-03-15 06:52 GMT

Mahipal Reddy: తన సోదరుడు మహిపాల్ అరెస్ట్ దారుణం

Mahipal Reddy: వైఎస్ అధికారంలో ఉన్నప్పుడే లక్డారం క్వారీ అనుమతులు తీసుకున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చెప్పారు. అక్రమ క్వారీలు నడుపుతున్నారంటూ తన సోదరుడు మధుసూదన్ రెడ్డిని అర్ధ రాత్రి అరెస్ట్ చేశారని ఆరోపించారు. గతంలోనే క్వారీని లీజుకు ఇవ్వడం జరిగిందన్నారు.

గత నాలుగేళ్లుగా తన సోదురుడు క్వారి నిర్వహణ పనులు చూసుకుంటున్నారని చెప్పారు. తప్పు చేస్తే నోటీసులు ఇచ్చి పెనాల్టీలు వేయాలన్నారు. గత ప్రభుత్వంలోని సమస్య ఇప్పుడు ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదన్నారు.

Tags:    

Similar News