లాక్ డౌన్ తో స్వస్థలం వెళ్లేందుకు ఓ వ్యక్తి పడరాని పాట్లు.. రెండు రోజుల్లో 115 కిలో మీటర్లు నడిచిన వ్యక్తి

Update: 2020-03-27 07:48 GMT

లాక్ డౌన్ తో ఓ వ్యక్తి సొంత ఊరికి వెళ్లేందుకు పడరాని పాట్లు పడ్డాడు. పది ఇరవై కాదు ఏకంగా 115 కిలో మీటర్లు నడిచి ఇంటికి చేరుకున్నాడు.

వరంగల్ నుంచి మంచిర్యాల వరకు రైల్వే ట్రాక్ పై నడిచాడు. రాత్రి వేళ ట్రాక్ పక్కన నిద్రించి ఉదయం లేవగానే నడక ప్రయాణం కొనసాగించాడు. రెండు రోజులపాటు 115 కిలో మీటర్లు నడిచి మంచిర్యాల లోని తన ఇంటికి చేరుకున్నాడు.

Tags:    

Similar News