రాజన్న సిరిసిల్ల జిల్లాలో దొంగకు దేహశుద్ధి

* పద్మానగర్‌లోని ఓ ఇంట్లో చోరీ * రూ.7 లక్షలు నగదు అపహరణ * స్థానికుల సహాయంతో దొంగను పట్టుకున్న బాధితులు

Update: 2020-12-30 06:25 GMT

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ దొంగకు దేహశుద్ధి చేశారు గ్రామస్తులు. పద్మానగర్‌లోని ఓ ఇంట్లో నివాసం ఉంటున్న దొంగ ఆ పక్క ఇంటినే టార్గెట్‌గా ఎంచుకున్నాడు. ఇంట్లో వాళ్లంతా ఊరికి వెళ్లడం గమనించిన దొంగ దాన్నే అదనుగా భావించి తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డాడు. స్థలం కొనుగోలు కోసం దాచిన 7 లక్షల నగదును అపహరించాడు. ఇక అదే సమయంలో ఊరికి వెళ్లినవారు తిరిగి రావడంతో వారిని చూసిన దొంగ పారిపోయేందుకు ప్రయత్నించాడు. స్థానికుల సహాయంతో దొంగను పట్టుకుని  చితకబాదారు. అనంతరం నగదును స్వాధీనం చేసుకున్నారు.


Full View


Tags:    

Similar News