రేపు వారణాసికి వెళ్లనున్న కిషన్ రెడ్డి, డా.లక్ష్మణ్
ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతుగా నేతల ప్రచారం
రేపు వారణాసికి వెళ్లనున్న కిషన్ రెడ్డి, డా.లక్ష్మణ్
తెలంగాణలో ఎన్నికలు ముగియడంతో ఇక్కడి నేతలను మిగతా రాష్ట్రాల్లో ప్రచారానికి జాతీయ పార్టీలు వినియోగిస్తున్నాయి. అందులో భాగంగా తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్లను వారణాసికి పార్టీ పంపిస్తుంది. రేపటి నుంచి నాలుగు రోజుల పాటు వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. జూన్ ఒకటి వరకు ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో డాక్టర్ లక్ష్మణ్ ప్రచారం నిర్వహించనున్నారు.