జర్మనీ పారిశ్రామికవేత్తలతో కలిసి పని చేసేందుకు సిద్ధం :‌ మంత్రి కేటీఆర్

KTR: జర్మనీ పెట్టుబడులకు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పలుకుతుందన్నారు మంత్రి కేటీఆర్...

Update: 2021-12-06 10:12 GMT

జర్మనీ పారిశ్రామికవేత్తలతో కలిసి పని చేసేందుకు సిద్ధం :‌ మంత్రి కేటీఆర్

KTR: జర్మనీ పెట్టుబడులకు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పలుకుతుందన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో జర్మనీ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. పరిశ్రమల ఏర్పాటుకు 2వేల ఎకరాల స్థలం అందుబాటులో ఉందని, వారికి కావాల్సిన మౌలిక వసతులు కల్పిస్తామన్నారు.

అన్ని రంగాలకు 24గంటల విద్యుత్ సరఫరా అందుబాటులో ఉందని స్పష్టం చేశారు కేటీఆర్. పరిశ్రమలకు సింగిల్ విండో విధానంలో దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామని తెలిపారు.

Tags:    

Similar News