తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా సాగుతోంది. 120 మున్సిపాలిటీల్లో 80 స్థానాల్లో దూసుకుపోతోంది. ఇక 9 కార్పొరేషన్లలో 4 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ భవన్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నేతలు, శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్కు చేరుకుంటున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఇప్పటికే తెలంగాణ భవన్ చేరుకుని, అక్కడ నుంచి ఎన్నికల కౌంటింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. ఇక ఫలితాల అనంతరం సంబరాలు జరపడానికి పార్టీ శ్రేణులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి.