రాజనాథ్ సింగ్ తో మంత్రి KTR భేటీ

Update: 2019-10-30 14:09 GMT

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్‌ - నాగ్‌పూర్‌, హైదరాబాద్‌ - రామగుండం జాతీయ రహదారులను విస్తరించడానికి నగరంలోని రక్షణ శాఖ భూములను కేటాయించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న రహదారులు రవాణావసరాలకు సరిపోవడం లేదని, ఆయా మార్గాల్లో స్కైవేల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినందున భూముల అప్పగింతపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని రాజ్‌నాథ్‌ను కేటీఆర్‌ కోరారు.   

Tags:    

Similar News