KTR : హిల్ట్ పాలసీ పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు
KTR : ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరుతో కాంగ్రెస్ సర్కార్ 5 లక్షల కోట్లు కుంభకోణానికి పాల్పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
KTR : ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరుతో కాంగ్రెస్ సర్కార్ 5 లక్షల కోట్లు కుంభకోణానికి పాల్పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కుత్బుల్లాపూర్, జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో బీఆర్ ఎస్ నాయకుల బృందంతో కేటీఆర్ పర్యటించారు. ఆయా ప్రదేశాల్లో కార్మికులతో కాంగ్రెస్ సర్కారు చేస్తున్న కుట్రలను వారికి వివరించారు. హైదరాబాద్లో గత ప్రభుత్వాలు పారిశ్రామిక అవసరాల కోసం 9 వేల 300 ఎకరాల స్థలాలను రైతులు, ప్రజల దగ్గరి నుండి సేకరించి పరిశ్రమలకు కట్టబెట్టిందన్నారు.