Kishan Reddy: హుజూరాబాద్ ఉప ఎన్నిక ఆత్మగౌరవ చిహ్నం

*దళితబంధు పేరు హుజూరాబాద్ ఈటెల రాజేందర్ పథకం గా మార్చాలి *కుటుంబ పెత్తనాన్ని ఎదిరించినందుకే ఈటలకు ఈ కష్టం: కిషన్ రెడ్డి

Update: 2021-10-08 13:15 GMT

కిషన్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Kishan Reddy: హుజూరాబాద్ ఉప ఎన్నిక ధర్మానికి, అధర్మానికి, ఆత్మగౌరవానికి, నియంతృత్వానికి మధ్య జరగుతున్న ఎన్నికలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రంలో ఒక్క కుటుంబమే ఉండాలన్నది దుర్మార్గమైన ఆలోచన అన్నారు ఈటల. దళిత బంధు పథకం తేవడం గర్వకారణమని దానికి హుజూరాబాద్ ఈటెల రాజేందర్ పథకంగా పేరు పెట్టాలన్నారు. కుటుంబ పెత్తనాన్ని వ్యతిరేకించిన వ్యక్తి ఈటల అని అన్నారు. టీఆర్ఎస్ కు నైతిక విలువలులేవని, తెలంగాణ ప్రజల భవిష్యత్తును మార్చే శక్తి హుజూరాబాద్ ప్రజలకి ఉందని అన్నారు కిషన్ రెడ్డి.

Tags:    

Similar News