టీఆర్ఎస్ అండతోనే ఎంఐఎం అల్లర్లు సృష్టిస్తోంది
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం చిత్తశుద్ధితో ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం చిత్తశుద్ధితో ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడమే కేసీఆర్ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు. నిర్మల్ జిల్లాలోని తల్వేద గ్రామంలో కొత్తగా నిర్మించిన బీజేపీ కార్యాలయన్ని రాష్ట్ర అధ్యక్షుడు లక్షణ్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్రం రైతులకు ఎకరానికి రూ.6 వేలు ఇస్తుంటే సీఎం కేసీఆర్.., మంత్రి కేటీఆర్లకు కనిపించడం లేదా అని నిలదీశారు. ఆదిలాబాద్లో ఒక గిరిజన బిడ్డను ప్రజలు ఎంపీగా గెలిపించడం శుభపరిణామం అని కిషన్రెడ్డి అన్నారు.
ఎంఐఎం పార్టీపై కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం మత ఘర్షణలు సృష్టించిన ఘనత ఎంఐఎం పార్టీకే దక్కుతుందని ఆరోపించారు. హైదరాబాద్కే పరిమితమైన మజ్లిస్ పార్టీని భైంసా వరకు తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని విమర్శించారు. టీఆర్ఎస్ అండదండలతోనే ఎంఐఎం అల్లర్లు సృష్టిస్తోందని వాఖ్యానించారు. కల్వకుంట్ల, ఒవైసీ కుటుంబాల నుంచి తెలంగాణాని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలకు ఉందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై ఇవ్వలేదని టీఆర్ఎస్ ఆరోపణలు చెస్తుందని. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై కేసీఆర్, కేటీఆర్ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం రాయితీ రేషన్ బియ్యంపై రూ. 28 భరిస్తే కేసీఆర్ సర్కార్ మాత్రం కేవలం రూ.2 మాత్రమే భరిస్తోందని తెలిపారు.