నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నా.. కేంద్రంపై సీఎం కేసీఆర్ ఆగ్రహం..

CM KCR: ఆదివారం ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు.

Update: 2022-08-06 11:57 GMT

నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నా.. కేంద్రంపై సీఎం కేసీఆర్ ఆగ్రహం..

CM KCR: ఆదివారం ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసినట్లు ఆయన చెప్పారు. నీతి ఆయోగ్ సిఫారసులను కేంద్రం పట్టించుకోవడం లేదని.. అది ఒక నిరర్థక ఆస్తిగా మిగిలిపోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్లానింగ్ కమిషన్ స్థానంలో వచ్చిన నీతి ఆయోగ్ దేశంలో సాధించిన విజయమేమీ లేదని విమర్శలు గుప్పించారు సీఎం కేసీఆర్.

Tags:    

Similar News