కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

-ఇస్లామిక్ దేశాల నుంచి వస్తున్న డబ్బుతో ఉద్యమాలు చేస్తున్నారు -సీఏఏ చట్టం ఎవరికి వ్యతిరేకం కాదు-బండి సంజయ్ -ఒవైసీ సోదరుల ఆటలు సాగవ్-బండి సంజయ్

Update: 2020-01-08 11:54 GMT

పౌరసవరణ చట్టంపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఏఏను వ్యతిరేకించే వారిని బ్రేకుల్లేని బస్సుల్లో పాకిస్తాన్ పంపిస్తామంటూ హెచ్చరించారు. ఓరుగల్లులో సీఏఏకు మద్దతుగా నిర్వహించిన భారీ ర్యాలీ సభలో బండి సంజయ్ పాల్గొన్నారు. దేశాన్ని విచ్చిన్నం చేయాలని కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు చూస్తున్నాయని ఆరోపించారు.

ఇస్లామిక్ దేశాల నుంచి వస్తున్న డబ్బుతో ఉద్యమాలు చేస్తున్నారని.. ఒవైసీ సోదరుల ఆటలు ఇక సాగవన్నారు. యుద్ధం మొదలయ్యింది.. ఎవరినీ వదిలేది లేదన్నారు బండి సంజయ్. పచ్చ జెండాలతో ర్యాలీ తీసి అపవిత్రం చేసిన ఓరుగల్లు గడ్డను పవిత్రం చేయడానికే కాషాయ ర్యాలీ చేపట్టామన్నారు.


Full View


Tags:    

Similar News