కుమ్రంబీమ్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని కంకాలమ్మ జాతరకు పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. మహేంద్రుల ఆరాద్య దైవం కంకాల అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దేశంలో కంకాలమ్మ రెండో ఆలయం కావడంతో మేదర కులస్తులు భారీగా తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.