Telangana: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Telangana: ఇకపై పార్టీ శ్రేణులు చెప్పిందే వేదం -ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

Update: 2021-02-19 06:15 GMT
జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి (ఫోటో ది హన్స్ ఇండియా)

Telangana: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై పార్టీ శ్రేణులు చెప్పిందే వేదమని, కార్యకర్తలు సూచించినవారికే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. వారికే ఇళ్లు, ఇళ్ల స్థలాలు, పెన్షన్లు మంజూరవుతాయని చెప్పారు. టీఆర్‌ఎస్‌లో కార్యకర్తలకు సముచిత ప్రాధాన్యం కల్పించేందుకు అధిష్టానం చర్యలు తీసుకుంటుందని అన్నారు. రాష్ట్రంలో సూర్యచంద్రులు ఉన్నంత వరకూ టీఆర్‌ఎస్‌ పార్టీ బతికే ఉంటుందని వ్యాఖ్యానించారు ముత్తిరెడ్డి. 

Tags:    

Similar News