హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోపై ఐటీ దాడులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. జూబిలీహిల్స్, నానక్ రామ్ గూడలోని రామానాయుడు స్టూడియో, సురేష్ ప్రొడక్షన్స్ కార్యాలయాల్లో ఐటీ అధికాలులు తనిఖీలు చేస్తున్నట్టు సమాచారం. బుధవారం ఉదయం నుంచి రామానాయుడు స్టూడియోతో పాటు పది చోట్ల సోదాల్ని ఏకకాలంలో నిర్వహిస్తున్నారు. పన్నుల ఎగవేతకు సంబంధించి అధికారులు ఆరా తీస్తున్నారు. అలాగే.. నిర్మాత.. సురేష్ బాబు, హీరో వెంకటేష్ నివాసాల్లోనూ ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.
కాగా కొద్దిరోజుల క్రితం మైత్రి మూవీ మేకర్స్, దిల్ రాజు, కెఎల్ నారాయణ నివాసాలు, కార్యాలయాల్లోనూ ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ సినిమాస్ కార్యాలయాలపై కూడా గతనెల ఐటీ దాడులు జరిగాయి. ఐటీ దాడుల నేపథ్యంలో టాలీవుడ్ అగ్రనిర్మాతలు ఒక్కసారిగా ఆందోళనకు గురవుతున్నారు.