Telangana: సీఎం కేసీఆర్కు రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఆయన గౌరవార్థం ఈనెల 25న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ విందు ఇవ్వనున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఆయన గౌరవార్థం ఈనెల 25న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ విందు ఇవ్వనున్నారు. విందు కార్యక్రమానికి పలు రాష్ట్రాల సీఎంలను రాష్ట్రపతి కోవింద్ ఆహ్వానించారు. ఇందులో భాగంగా ట్రంప్తో విందు కార్యక్రమంలో పాల్గొనాలని సీఎం కేసీఆర్కు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆహ్వానం అందినట్లు సమాచారం.
ఈమేరకు ఈనెల 25న సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు. తెలంగాణ సీఎంతో పాటు మహారాష్ట్ర, హరియాణా, బిహార్, ఒడిశా, కర్ణాటక ముఖ్యమంత్రులకు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది.