Indiramma Indlu: పేదలకు ఇందిరమ్మ ఇండ్లు.. సర్కార్ కీలక అప్డేట్

Indiramma Indlu: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు వేగంగా జరుగుతోందని రాష్ట్ర గృహనిర్మాణ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి. గౌతం తెలిపారు.

Update: 2025-07-26 07:55 GMT

Indiramma Indlu: పేదలకు ఇందిరమ్మ ఇండ్లు.. సర్కార్ కీలక అప్డేట్

Indiramma Indlu: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు వేగంగా జరుగుతోందని రాష్ట్ర గృహనిర్మాణ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి. గౌతం తెలిపారు. ఇప్పటివరకు 1.74 లక్షల మంది లబ్ధిదారులు గృహ నిర్మాణాన్ని ప్రారంభించారని ఆయన శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.

గౌతం వివరించిన ప్రకారం, ఇప్పటి వరకు దాదాపు 57,000 ఇండ్లు బేస్‌మెంట్ దశను పూర్తి చేసుకొని వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయనీ, వీటిలో 5,000 ఇండ్లు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. “ఈ పథకం ప్రధాన ఉద్దేశం అత్యంత పేదలకు ఆవాస హక్కును కల్పించడం” అని ఆయన స్పష్టం చేశారు.

ప్రభుత్వం ఇప్పటివరకు నిర్మాణ పనులు ప్రారంభించిన లబ్ధిదారులకు రూ. 386.12 కోట్లు విడుదల చేసిందనీ, ప్రతి సోమవారం నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నామని వెల్లడించారు. ఈ వారంలో మాత్రమే రూ. 115 కోట్లు చెల్లించినట్లు తెలిపారు.

ఇక అర్హుల ఎంపికలో కూడా ప్రభుత్వం నిర్దిష్ట ప్రమాణాలు పాటిస్తున్నదని తెలిపారు. సాంకేతిక పద్ధతుల్లో భాగంగా 360 డిగ్రీల పరిశీలన ద్వారా ఎంపికైన 12,700 మందిలో 10,700 మంది అర్హులుగా తేలారని, 1,950 మంది అనర్హులుగా నిర్ధారించబడినట్లు చెప్పారు. వారి స్థానంలో ఇతర అర్హులను గుర్తించాలని జిల్లా కలెక్టర్లకు already ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.

ఇదిలా ఉండగా, 20 వేల మందికి ఇండ్లు రద్దు చేసినట్లు వస్తున్న ఆరోపణలు నిరాధారమని గౌతం ఖండించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రభుత్వం రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోందనీ, దీన్ని నాలుగు విడతల్లో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నట్టు చెప్పారు.

ఈ ప్రకటనతో ఇందిరమ్మ పథకం పురోగతిపై స్పష్టత రావడంతో పాటు, నిర్ధారణ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందన్న సంకేతాలు వచ్చాయి.

Tags:    

Similar News