ప్రగతి భవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌

Update: 2020-08-15 07:14 GMT

Independence Day 2020: 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను తెలంగాణలో ఘనంగా నిర్వహించారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలోని అమరవీరుల సైనిక స్మారకం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాళులర్పించారు. అనంతరం ప్రగతిభవన్‌కు చేరుకుని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు ఆయన మహనీయుల చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. దేశానికి వారి చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఆయన వెంట పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులున్నారు.

Tags:    

Similar News