హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో దారుణం

Update: 2020-10-16 09:27 GMT

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో దారుణం వెలుగుచూసింది. స్నేహం ముసుగులో ఓ యువతిపై ముగ్గురు అత్యాచారం చేశారు. బర్త్ డే కేకులో మత్తు మందు ఇచ్చి దారుణానికి ఒడిగట్టారు. విషయం బయటకు చెబితే చంపేస్తామంటూ బెదిరించారు. యువతి తీవ్ర అస్వస్థతకు గురవడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. అనంతరం గట్టిగా అడగడంతో యువతి అసలు వి‍షయం బయటపెట్టింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితులు జోసెఫ్‌, రాము, నవీన్‌లపై కేసు నమోదు చేశారు పోలీసులు.

Full View

 

Tags:    

Similar News