Hyderabad: హైదరాబాద్‌లో కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు

Hyderabad: లాక్‌డౌన్ పొడిగింపుతో సొంతూళ్లకు పయనమవుతున్న జనం * ఈనెల 30 వరకు లాక్‌డౌన్ పొడిగించిన తెలంగాణ ప్రభుత్వం

Update: 2021-05-19 05:36 GMT

హైదరాబాద్ బస్సు స్టాండ్ (ఫైల్ ఇమేజ్)

Hyderabad: తెలంగాణలో కర్ఫ్యూ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముందుగా ప్రకటించిన పదిరోజుల లాక్‌డౌన్‌ ఈనెల 21తో ముగియనుండగా.. ఆ నిబంధనల్ని 30వ తేదీ వరకు పొడిగిస్తూ తాజాగా ఆదేశాలిచ్చింది ప్రభుత్వం. లాక్‌డౌన్ పొడిగించడంతో హైదరాబాద్‌లోని వలస జీవులు సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో నగరంలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి.

Tags:    

Similar News