కరోనాతో గాంధీ ఆసుపత్రిలో చేరిన 14 మంది నెగిటివ్ రావడంతో డిశ్చార్జ్ అయ్యారు. డాక్టర్ల సేవలు మర్చిపోలేనివని కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. డాక్టర్ల కృషి వల్లే తాము కోలుకోగలిగామని చెబుతున్నారు. మరోవైపు వీరిని చూసి డాక్టర్లు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కరోనాను జయించిన వీరిని 14 రోజులు హౌస్ క్వారంటైన్లో ఉండాలని ఆదేశించారు.