హుజూర్ నగర్ అభ్యర్థిగా సైదిరెడ్డిని ఖరారు చేసిన టీఆర్ఎస్
హుజూర్ నగర్ అభ్యర్థిగా సైదిరెడ్డిని ఖరారు చేసిన టీఆర్ఎస్ హుజూర్ నగర్ అభ్యర్థిగా సైదిరెడ్డిని ఖరారు చేసిన టీఆర్ఎస్
హుజూర్ నగర్ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డిని ఖరారు చేసింది టీఆర్ఎస్. 2018 లో టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై సైదిరెడ్డి పోటీ చేశారు. ఆర్ధికంగా, సామాజికంగా బలమైన వ్యక్తి సైదిరెడ్డి అని టీఆర్ఎస్ అంటోంది. ఇటు కాంగ్రెస్ నుంచి తన సతీమణి పద్మావతిరెడ్డి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు ఉత్తమ్. దీంతో పోటీ రసవత్తరంగా మారనుంది. కాగా హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చెయ్యడం తో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. అక్టోబరు 21న పోలింగ్ జరిగి, అదే నెల 24న ఫలితాలు విడుదల కానున్నాయి.