ఆర్టీసీ కార్మికుల పట్ల సీఎం కేసీఆర్ చిన్న చూపు చూడటం తగదన్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఆర్టీసీ ప్రైవేట్ పరం అయితే ప్రజలు ఇబ్బందులు పడుతారన్నారు. మానవత్వంతో ఆలోచన చేసి ఆర్టీసీ కార్మికులకు ఇవ్వాల్సిన వేతనాలు చెల్లించి విధుల్లోకి తీసుకోవాలన్నారు. ఆర్టీసీ కార్మికుల పట్ల ఎలాంటి తప్పుడు నిర్ణయాల తీసుకున్నా భవిష్యత్ లో చెడ్డపేరు తప్పదన్నారు.