తెలంగాణ, ఆంధ్రా సీఎంల సమావేశంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. సమైక్యవాది, విభనవాదుల సమావేశం ముచ్చటేస్తోందని సెటైర్లు విసిరారు. కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రా? ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రా? అని సందేహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన నీటిని ఆంధ్రాకు తరలిస్తామని ఎలా అంటారు? అని ప్రశ్నించారు. తాము రాయలసీమకు నీళ్లిస్తామంటే, ఆంధ్రోళ్లకు నీళ్లు దోపిడీ చేస్తున్నారని విమర్శించారని, నీళ్ల తరలింపునకు ఇప్పుడెలా మద్దతిస్తారని మండిపడ్డారు.