జూబ్లీహిల్స్ బోగస్ ఓట్లపై హైకోర్టులో ముగిసిన విచారణ
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోగస్ ఓట్ల నమోదుపై హైకోర్టులో విచారణ జరిగింది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోగస్ ఓట్ల నమోదుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు. హైకోర్టు విచారణలో భాగంగా బోగస్ ఓట్లపై విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం సమాధానం ఇచ్చింది. దీనిపై స్పందించిన హైకోర్టు, ఈసీ ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని, అందువల్ల ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.