కృష్ణాజిల్లా నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయానికి.. అలనాటి హీరో వడ్డే నవీన్ వచ్చారు. స్పందన కార్యక్రమంలో నవీన్.. అర్జీ పెట్టుకున్నారు. ఏ కొండూరులోని మాధవరం గ్రామంలో 18 ఎకరాల మామిడి తోట ల్యాండ్ సీలింగ్ కోల్పోయినట్లు నవీన్ తెలిపారు. 1975 నుంచి తమకు పరిహారం అందడం లేదని.. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం.. తమకు పరిహారం అందించాలంటూ సబ్ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. అయితే అర్జీ పరిశీలించిన తర్వాత పరిహారంపై నిర్ణయం తీసుకుంటామని.. నూజివీడు సబ్ కలెక్టర్ వివరించారు.