తెలంగాణాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయదుందుభి మోగించింది. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ దూకుడు కొనసాగుతోంది. తిరుగులేని జోరుతో దూసుకుపోతున్న కారు ఇప్పటివరకు 103 మున్సిపాలిటీలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది.
ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి హరీశ్రావు ట్విట్టర్ ద్వారా కేసీఆర్కు, కేటీRaoఆర్కు అభినందనలు తెలియజేశారు. ''ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం టీఆర్ఎస్ దేనని మరోసారి రుజువు చేశారు తెలంగాణ ప్రజలు. మునిసిపల్ ఎన్నికల్లోనూ టిఆర్ఎస్ ప్రభంజనమే వీసింది. ముఖ్యమంత్రి కేసీఆర్కూ, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అభినందనలు. ప్రత్యర్థులు అందుకోలేని స్థాయిలో టీఆర్ఎస్కు తిరుగులేని ఫలితాలు సాధించడంలో కష్టపడిన మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఇతర ప్రజాప్రతినిధులకు, మరీ ముఖ్యంగా కార్యకర్తలకు అభినందనలు. బంగారు తెలంగాణ సాధన కేసీఆర్ సారధ్యంలోని ఒక్క టీఆర్ఎస్కే సాధ్యమని చాటిన ప్రజానికానికి మనఃపూర్వక కృతజ్ఞతలు.'' అంటూ హరీశ్రావు ట్వీట్ చేశారు.
ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం టిఆర్ఎస్ దేనని మరోసారి రుజువు చేశారు తెలంగాణ ప్రజలు. మునిసిపల్ ఎన్నికల్లోనూ టిఆర్ఎస్ ప్రభంజనమే వీసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అభినందనలు.
— Harish Rao Thanneeru (@trsharish) January 25, 2020
ప్రత్యర్థులు అందుకోలేని స్థాయిలో TRS కు తిరుగులేని ఫలితాలు సాధించడంలో కష్టపడిన మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఇతర ప్రజాప్రతినిధులకు, మరీ ముఖ్యంగా కార్యకర్తలకు అభినందనలు. బంగారు తెలంగాణ సాధన కేసీఆర్ సారధ్యంలోని ఒక్క టిఆర్ఎస్ కే సాధ్యమని చాటిన ప్రజానికానికి మనఃపూర్వక కృతజ్ఞతలు.
— Harish Rao Thanneeru (@trsharish) January 25, 2020