Harish Rao: కేంద్రంలోని బీజేపీ తెలంగాణను మోసం చేసింది
Harish Rao: విభజన చట్టం హామీలు అమలుచేయకండా మోసం చేశారు
Harish Rao: రాష్ట్ర విభజన చట్టంలోని హామీలు అమలు చేయడకుండా కేంద్రంలోని బీజేపీ సర్కార్ తెలంగాణను మోసం చేసిందని విమర్శించారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి వంద రోజులు అయినా ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. తెలంగాణ నుంచి నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచినా ఒక్కనాడు కూడా పార్లమెంట్లో మాట్లాడలేదని ఆరోపించారు. కేంద్రం నుంచి రాష్ట్రం కోసం ఎలాంటి ప్రత్యేక నిధులు కూడా రాబట్టలేకపోయారని విమర్శించారు హరీష్రావు. ఇతర పార్టీలకు వేర్వేరు సిద్ధాంతాలు, ఎజెండాలు ఉన్నా.. బీఆర్ఎస్ది మాత్రం తెలంగాణ గళమేనన్నారు హరీష్రావు.