Harish Rao: బీజేపీ దుకాణం సర్దుకుంది.. కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కోసం పాకులాడుతోంది
Harish Rao: కాంగ్రెస్, బీజేపీ నేతలు పగటి కలలు కంటున్నారు
Harish Rao: అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ , బీజేపీ నేతలు పగటి కలలు కంటున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. అబద్దాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. బీజేపీ దుకాణం సర్దుకుందని... కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కోసం పాకులాడుతోందని ఎద్దేవా చేశారు. ధరిణి ఎత్తేస్తే మళ్లీ పైరవీకారులు పుట్టుకొస్తారన్నారు. కామారెడ్డి జిల్లా లింగపేట్ లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో హరీష్ రావు మాట్లాడారు.