హాజీపూర్ వరుస హత్యల కేసులో రేపే తీర్పు

నల్గొండ జిల్లా హాజీపూర్ వరుస హత్యల కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

Update: 2020-02-05 14:02 GMT
Hajipur Srinivas Reddy File Photo

నల్గొండ జిల్లా హాజీపూర్ వరుస హత్యల కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా.. హాజీపూర్‌ అత్యాచారం, హత్య కేసు విచారణ తుది దశకు చేరిన విషయం తెలిసిందే. ఈ కేసులో శ్రీనివాస్ ను పోలీసులు ప్రశ్నించగా, నివ్వెరపరిచే విషయాలు వెల్లడించాడు. ఈ కేసులో నిందితుడు సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డిపై ఫోక్సో స్పెషల్‌ కోర్టు రేపు తుది తీర్పు ఇవ్వనుంది. ఈ కేసులో రాచకొండ పోలీసులు పూర్తి సాక్యాధారాలను కోర్టుకు సమర్పించారు. ప్రాసిక్యూషన్ కూడా నిందితుడికి ఉరిశిక్ష విధించాలని వాదించింది. ఈ నేపథ్యంలో ఫోక్సో స్పెషల్‌ కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

అంతకుముందు ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని ఫోక్సో స్పెషల్‌ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. మనీషా కేసుకు సంబంధించి 29 మంది సాక్షులు చెప్పిన వాంగ్మూలాలను నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి వినిపించారు. వాంగ్మూలాన్ని న్యాయస్థానం రికార్డు చేసింది. కాగా తీర్పును గురువారం వెల్లడించనుంది.

 

Tags:    

Similar News