మరికాసేపట్లో పెళ్లి.. పరారైన పెళ్లికొడుకు..

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం దేవానగరంలో దారుణం చోటుచేసుకుంది.

Update: 2022-01-07 11:59 GMT

మరికాసేపట్లో పెళ్లి.. పరారైన పెళ్లికొడుకు..

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం దేవానగరంలో దారుణం చోటుచేసుకుంది. మరికొన్ని నిమిషాల్లో వివాహం అనగా పెళ్లికొడుకు పరారయ్యాడు. దేవానగరానికి చెందిన గౌతమి, ములుగు జిల్లా యాకన్నగూడెంకు చెందిన రాజ్‌కుమార్‌లు గత కొంతకాలంగా సహజీవనం చేశారు. ఇవాళ పెద్దల సమక్షంలో వివాహం చేసుకునేందుకు చర్ల ఆంజనేయస్వామి ఆలయంలో ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో ముహూర్త సమయానికి పెళ్లికొడుకు రాజ్‌కుమార్ గౌతమికి హ్యాండ్ ఇచ్చి పరారయ్యాడు. దీంతో గౌతమి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News