ప్రపంచమంతా యోగాసనాలు వేస్తోంది. దేశమంతా ధ్యానం, ప్రాణాయామం చేస్తోంది. ఐదో అంతార్జతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్భవన్లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ దంపతులు యోగాసనాలు వేశారు. రాజభవన్ సిబ్బంది, ఉద్యోగులు కూడా యోగాసనాలు వేశారు. నిత్యమూ యోగాను క్రమం తప్పకుండా చేయడం ద్వారా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందవచ్చన్నారు. రోగాలను శరీరం దరిదాపుల్లోకి కూడా రాకుండా చేస్తుందని ప్రతి ఒక్క యోగా చేయాలని సూచించారు.