Hyderabad: మాస్క్ లేకుంటే రూ. 2వేలు ఫైన్

Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ కలవరపెడుతోంది.

Update: 2021-03-29 12:13 GMT

Hyderabad: మాస్క్ లేకుంటే రూ. 2వేలు ఫైన్

Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ కలవరపెడుతోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో కొవిడ్‌ కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. దీంతో మాస్క్‌ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో మాస్క్‌ ధరించని వారికి జీహెచ్‌ఎంసీ అధికారులు ఫైన్‌ విధిస్తున్నారు. మాస్క్‌ లేకుండా షాపులోకి అనుమతిచ్చిన ఫతేనగర్‌లోని ఓ షాప్‌ యజమానికి జీహెచ్ఎంసీ అధికారులు రెండు వేల జరిమానా విధించారు.

Tags:    

Similar News