గాంధీ ఆస్పత్రిలో స్వీపర్లు, పేషెంట్ కేర్ సిబ్బంది విధులను బహిష్కరించారు. పారిశుద్ధ్య కార్మికులకు ప్రకటించిన ప్రోత్సాహక నగదును గాంధీలో పని చేస్తున్న తమకు కూడా ఇవ్వాలని కోరుతున్నారు.
కాంట్రాక్టర్ వచ్చి తమకు హామీ ఇచ్చే వరకు విధులను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ పారిశుద్ద్య కార్మికులకు, మున్సిపాలిటీల్లో పని చేస్తున్న కార్మికులకు ప్రోత్సాహకాలుంటాయని సీఎం కేసీఆర్ ప్రకటించారు. గాంధీలో ప్రాణాలను పణంగాపెట్టి సేవ చేస్తున్నామని తమకు 8వేల జీతం మాత్రమే వస్తుందని వాపోయారు.