డిమాండ్ల సాధన కోసం 52రోజులుగా సమ్మె చేస్తున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తమ పోరాటానికి ఫుల్ స్టాప్ పెట్టారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. రేపట్నుంచి విధులకు హాజరవుతామని తెలిపిన ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి తాత్కాలిక ఉద్యోగులు ఇకపై విధులకు రాకుండా తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.