Nizamabad: రేషన్ కార్డుల జారీలో అవకతవకలు

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో రేషన్‌ కార్డుల జారీలో అవకతవకలు బయటపడ్డాయి.

Update: 2021-07-31 09:15 GMT

Nizamabad: రేషన్ కార్డుల జారీలో అవకతవకలు

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో రేషన్‌ కార్డుల జారీలో అవకతవకలు బయటపడ్డాయి. ఐదేళ్ల పిల్లల పేరిట కార్డులు జారీ చేశారు అధికారులు. నందిపేట్ మండలం తల్వేద గ్రామంలో ఆస్తులు ఉంటే కార్డు రాదన్న భయంతో చిన్నారుల పేర్లతో అప్లికేషన్లు వచ్చాయి. అయితే అధికారులు ఆ అప్లికేషన్లపై చిన్నారుల పేరిటే కార్డులు జారీ చేశారు. గ్రామంలో మొత్తం 65 కార్డులు మంజూరైతే అందులో 22 కార్డులు నిబంధనలకు విరుద్ధంగానే మంజూరయ్యాయి. అయితే అధికారులు నాట్ ఎలిజిబుల్ అని ఎంట్రీ చేసినా మండల స్థాయి నాయకుల పలుకుబడితో రికార్డులు తారుమారు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. 

Tags:    

Similar News