Tamilisai Soundararajan: బీజేపీలో చేరిన తమిళిసై సౌందర్యరాజన్

Tamilisai Soundararajan: తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఆమె క్రియాశీలకం కాబోతున్నారు.

Update: 2024-03-20 07:35 GMT

Tamilisai Soundararajan: బీజేపీలో చేరిన తమిళిసై సౌందర్యరాజన్ 

Tamilisai Soundararajan: మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్.. మళ్లీ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఆమె క్రియాశీలకం కాబోతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమిళిసై.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సమక్షంలో బీజేపీలో చేరారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి ఆమె బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు.

గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పని చేసిన తమిళిసైని బీజేపీ హైకమాండ్ గవర్నర్‌గా నియమించింది. 2019లో తెలంగాణ గవర్నర్‌గా బాధత్యలు చేపట్టారు. 2024 వరకు ఆమె విధులు నిర్వహించారు. ఐతే మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లో రావాలని భావించిన తమిళిసై.. నిర్ణయానికి బీజేపీ పెద్దలు ఓకే చెప్పడంతో బ్యాక్ టూ పాలిటిక్స్ అన్నారు. తమిళనాడులో బీజేపీ నుంచి పోటీకి గ్రీన్ సిగ్నల్ రావడంతో గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. అందుకు రాష్ట్రపతి కూడా ఆమోదం తెలపడంతో ఇవాళ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

Tags:    

Similar News