టీఆర్‌ఎస్‌ లో చేరిన కీలక నేత

Update: 2019-03-30 02:20 GMT

కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే అరికెల నర్సారెడ్డి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయన నివాసంలో నర్సారెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్‌. ఈ సందర్భంగా అరికెల మాట్లాడుతూ.. తన సన్నిహితులు, కార్యకర్తల సూచన మేరకు టీఆరెస్ లో చేరినట్టు చెప్పారు. త్వరలోనే కాంగ్రెస్‌ క్యాడర్‌ను పార్టీలో చేర్పించేందుకు భారీ ఎత్తున ఒక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

Similar News