హైదరాబాద్ పోలీసు విభాగంలో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. సైఫాబాద్ పోలీసు స్టేషన్లో పని చేస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్కు కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ స్టేషన్లో పని చేసే 12 మంది సిబ్బంది క్వారంటైన్లోకి వెళ్లారు. 10 మంది కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్ సెంటర్కు తరలించి పరీక్షలు చేయిస్తున్నారు. సదరు హెడ్ కానిస్టేబుల్కు ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని అధికారులు చెబుతున్నారు. ఐతే ఢిల్లీలో ప్రార్థనలు చేసి తిరిగొచ్చిన వారిని కలిసి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో లింక్ని వెతికే పనిలో నిమగ్నమయ్యారు. ఇతను ఇంకా ఎవరెవరిని కలిసాడు అని ఆరా తీస్తున్నారు.