హైదరాబాద్ లో పర్యటించనున్న Nirmala Sitharaman
మోదీ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ 2020పై వివిధ వర్గాలతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశం నిర్వహించి అభిప్రాయాలను సేకరించనున్నారు.
మోదీ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ 2020పై వివిధ వర్గాలతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశం నిర్వహించి అభిప్రాయాలను సేకరించనున్నారు. ఇందుకు గాను ఈ నెల 16,17 తేదీల్లో హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో పర్యటించనన్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసారు. ఈ పర్యటనలో భాగంగా బడ్జెట్తో ప్రభావితం కానున్న వర్గాలను ఆమె కలవనున్నారు. సమావేవం ప్రారంభం అయ్యాక మొదటి సెషన్లో ఆమె వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక వర్గాలు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు, రైతులతో మాట్లాడనున్నారు. అదే విధంగా రెండో సెషన్లో ఆర్థికవేత్తలు, ట్యాక్స్ ప్రాక్టీషనర్లు తదితరులతో భేటీ కానున్నారు.
ఈ నేపథ్యంలోనే శుక్రవారం (ఫిబ్రవరి 14) నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో అధికారులంతా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వ్యాపార, వాణిజ్య రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు, అదికారులు హాజరయ్యారు. ఇక పోతే ఫిబ్రవరి 1వ తేదీన లోక్ సభలో నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బీజేపీ ప్రభుత్వం 'జన్ జన్కా బడ్జెట్'గా పేర్కొంటున్న ఈ బడ్జెట్లో వ్యవసాయం, నీటి పారుదల, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, విద్య, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలకు ప్రాధాన్యం ఇచ్చి ఈ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. అనంతరం ఏ రాష్ట్రానికి ఎంత మేరకు బడ్జట్ ను కేటాయించిన విషయాల గురించి ఆమె సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఇక పోతే గతవారం ముంబై, చెన్నై, కోల్కతా నగరాల్లో నిర్వహించిన ఇలాంటి ఇంటరాక్టివ్ సెషన్లలో కూడా మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు.
ఫిబ్రవరి 16 మరియు 17 తేదీలలో హైదరాబాద్ మరియు బెంగళూరులకు
— PIB in Hyderabad (@PIBHyderabad) February 14, 2020
ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ @nsitharaman రెండు రోజుల అధికారిక పర్యటన.#JanJanKaBudget @nsitharamanoffc @PIB_India @PIBHyderabad @PIBBengaluru https://t.co/UeqgdR0DX9