Hyderabad: ఫ్రూట్ మార్కెట్‌ను తెరవాలంటూ వ్యాపారులు, రైతులు, హమాలీల ఆందోళన

Hyderabad: మార్కెట్ గేట్లను తొలగించేందుకు యత్నం

Update: 2021-11-17 01:40 GMT
గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ (ఫైల్ ఇమేజ్)

Hyderabad: హైదరాబాద్‌ గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఫ్రూట్ మార్కెట్‌ను తెరవాలంటూ వ్యాపారులు, రైతులు, హమాలీలు ఆందోళనకు దిగారు. మార్కెట్ గేట్లను తొలగించేందుకు యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ఆందోళనకారులను అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ స్థలంలో సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ ఏర్పాటుకు సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 25న పండ్ల మార్కెట్‌ను మూసివేసింది.

Tags:    

Similar News