ఖమ్మంలో నకిలీ నోట్ల కలకలం.. 7 గురి అరెస్ట్
ఖమ్మం పోలీసులు ఎట్టకేలకు నకిలీ నోట్లను చెలామణి చేస్తున్న ఏడుగురు నిందితులని అరెస్టు చేశారు.
ఖమ్మం పోలీసులు ఎట్టకేలకు నకిలీ నోట్లను చెలామణి చేస్తున్న ఏడుగురు నిందితులని అరెస్టు చేశారు. సత్తుపల్లిలోని రాజీవ్ నగర్ లో నివాసముంటున్న మాధర్ ఇంట్లో సుమారు రూ .40 లక్షల విలువగల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా మాధర్ పోలిసుల నుంచి తప్పించుకుని పారిపోయాడు.
సారూర్నగర్లో నకిలీ నోట్లను చెలామణి చేసిన 10 మందిని 2019 ఫిబ్రవరి 6 న రాచకొండ ఎస్ఓటి అరెస్టు చేసారు. సుమారు రూ .11.25 లక్షల విలువగల రూ.2000, రూ .500 దొంగ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పరారీలో ఉన్న నిందితులను ఎలాగైనా పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.