నిజామాబాద్‌లో విషాదం.. ఎలక్ట్రిక్ బైక్‌ బ్యాటరీ పేలి ఒకరు మృతి..

Electric Bike: నిజామాబాద్‌లో దారుణం జరిగింది.

Update: 2022-04-20 10:41 GMT

నిజామాబాద్‌లో విషాదం.. ఎలక్ట్రిక్ బైక్‌ బ్యాటరీ పేలి ఒకరు మృతి..

Electric Bike: నిజామాబాద్‌లో దారుణం జరిగింది. ఎలక్ట్రిక్ బైక్‌కి ఛార్జింగ్ పెడుతుండగా బ్యాటరీ పేలి ఒకరు మృతిచెందారు. ఈ ఘటనలో మరో ముగ్గురుకి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పర్యావరణానికి హాని కలగకూడదనే ఉద్ధేశంతో ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేస్తే.. బ్యాటరీ పేలి తమ ప్రాణాలు మీదకు వచ్చిందని మృతుడి కుటుంబ సభ్యులు వాపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.

Tags:    

Similar News