తెలంగాణలో విద్యావాలంటీర్లకు దసరా బొనాంజా ప్రకటించింది టీఆర్ఎస్ సర్కార్. గౌవర వేతనం 12 వేల రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18వేల విద్యావాలంటీర్లకు వేతనాలు పెరగనున్నాయి. ఈ మేరకు ఏడాది జూన్ నుంచి పెంచిన వేతనాలు అమల్లోకి వస్తాయి.