హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు...తనిఖీల్లో 19 బైకులు, 4 కార్లు సీజ్
హైదరాబాద్లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడుపొద్దని హెచ్చరిస్తున్నా... మందుబాబుల తీరు మాత్రం మారడం లేదు. మద్యం తాగి వాహనాలను నడపడం పరిపాటిగా మారిపోయింది. ఎన్నిసార్లు తనిఖీలు చేపట్టినా, వాహనాలను సీజ్ చేస్తున్నా గానీ పట్టుబడుతున్నారు. వారిలో ఏమాత్రం మార్పు రావడంలేదు. తాజాగా నగరంలో పలువురు మద్యం తాగి డ్రైవ్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు.
మద్యం మత్తులో మందుబాబులు హల్చల్ చేశారు. ఫిల్మింనగర్లోపైఫబాద్ సిఐ రాంచందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్లో వైసీపీనేత అవినాష్ నాయుడు కారు డ్రైవర్ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీకెండ్లో ఫుల్గా మందు కొట్టి కారు స్టీరింగ్ పట్టిన మందుబాబులపై కేసు నమోదు చేశారు. పలువాహనాలను సీజ్ చేశారు.పట్టుబడ్డ వాహనాల్లో 19 బైకులు, 4 కార్లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు.