Coronavirus: తెలంగాణలో డిగ్రీ, పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా

Coronavirus: తెలంగాణలోని అన్ని యూనివర్సిటీ పరిధిల్లో జరగాల్సిన డిగ్రీ, పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసింది ప్రభుత్వం.

Update: 2021-03-24 11:16 GMT

Coronavirus: తెలంగాణలో డిగ్రీ, పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా

Coronavirus: తెలంగాణలోని అన్ని యూనివర్సిటీ పరిధిల్లో జరగాల్సిన డిగ్రీ, పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసింది ప్రభుత్వం. విద్యాసంస్థల బంద్ తో పరీక్షలు వాయిదా వేశారు. రీషెడ్యూల్ తర్వాత పరీక్షల నిర్వాహణ ఉంటుందని తెలంగాణ ఉన్నత విద్యా మంలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి తెలిపారు.

రాష్ట్రంలో కరోనా తీవ్రత పెరుగుతున్నందున విద్యాసంస్థలన్నింటినీ బుధవారం నుంచి మూసివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు పదో తరగతి, ఇంటర్‌ వార్షిక పరీక్షలు జరుగుతాయా?లేదా అనే విషయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఉత్కంఠ నెలకొంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

Tags:    

Similar News